13 May, 2026 | 6:07 PM

సీసీ రోడ్డు తవ్వకాలను అడ్డుకున్న కాలనీవాసులు

05-02-2025 01:30 AM

పటాన్ చెరు, ఫిబ్రవరి 4 :  బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని అయిదవ వార్డు ఐడీఏ కాలనీలో ఇటీవల సీసీ రోడ్డు నిర్మించారు. కాగా మంగళవారం  మిషన్ భగీరథ పైపులైన్  కోసం సీసీ రోడ్డును తవ్వేందుకు జేసీబీ రావడంతో కాలనీ వాసులు అడ్డుకున్నారు.

దీంతో జేసీబీ వెనుతిరిగి పోయింది. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్ల పేరుతో ఎక్కడ పడితే అక్కడ తవ్వి వదిలి వేస్తుండంటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కాలనీవాసులు  ఆవేదన వ్యక్తం చేశారు.