27 July, 2026 | 12:58 PM

Breaking News

మట్టి, ఇసుక మాఫియాలను మంత్రి తుమ్మల నడిపిస్తున్నారు   •   ముత్యాలంపాడు ఎక్స్‌ రోడ్డులో విత్తన మేళా ప్రారంభం   •   రామాలయ కమిటీ చైర్మన్‌పై రాజుకుంటున్న రాజకీయం   •   100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •  

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు

27-07-2026 12:27 PM

బోధన్, జూలై 27 (విజయక్రాంతి): బోధన్ మండలం బెల్లాల్ గ్రామపంచాయతీలో(Bellal Gram Panchayat) 15వ ఆర్థిక సంఘం (15వ ఫైనాన్స్) మరియు జనరల్ ఫండ్స్ నిధుల వినియోగంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వార్డు సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు ప్రకారం, గ్రామసభ సమావేశాల్లో హాజరు పట్టికపై సభ్యుల సంతకాలు తీసుకున్న అనంతరం, వారి సమక్షంలో కాకుండా తీర్మానాలు నమోదు చేశారని ఆరోపించారు. అలాగే 40 సిమెంట్ పైపుల కొనుగోలు పేరుతో రూ.2.83 లక్షలు, సబ్‌మర్సిబుల్ బోరు మోటారు కొనుగోలు పేరుతో రూ.1.05 లక్షల బిల్లులు చేసి, ఆ మొత్తాలను నేరుగా సరఫరాదారులకు చెల్లించకుండా సర్పంచ్ భార్య ఖాతాకు మళ్లించారని పేర్కొన్నారు.

2026 జనవరి 1 నుంచి జూలై 1 వరకు గ్రామపంచాయతీలో జరిగిన అన్ని ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపించి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వార్డు సభ్యులు, గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరారు. ఇవి వార్డు సభ్యులు చేసిన ఆరోపణలు మాత్రమే. వీటిపై సంబంధిత ప్రజాప్రతినిధుల వివరణ, అధికారుల విచారణ జరిపించాలని బోధన్ ఆర్డిఓ కు వినతిపత్రం అందజేశారు.