అత్యవసర సమయంలో అవస్థలు
10-01-2026 05:34 PM
- అమ్మా అనాధ వృద్ధాశ్రమము ఓబులాపూర్
తంగళ్ళపల్లి పల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ళపల్లి మండలం అమ్మా అనాధ వృద్ధాశ్రమంలో యాంసాని సత్య లక్ష్మి భర్త రామేశము(78) కాలు జారీ పడిపోగా నడుము విరిగింది. గోగుల లక్ష్మి భర్త లస్మయ్య(65) తీవ్ర అనారోగ్యముతో బాధపడుతుండగా ఇద్దరు వృద్ధుల గురించి 108కు ఫోన్ చేయగా వచ్చింది. కానీ రావడానికి దారిలేక దారి బురదతో ఉండడంతో చాలదురం టెచర్ లో పట్టుకుని తీసుకురావడం జరిగింది అంబులెన్సు సిబ్బంది మేము గంట సమయం ఇబ్బంది పడ్డాము గత 13 సంవత్సరాలనుండి రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాము. ప్రభుత్వం దయవుంచి వృద్ధాశ్రమానికి సీసీ రోడ్డు వేస్తే బాగుండు నని కోరుతున్నాము.






