15-06-2025 01:00:27 AM
తెలంగాణలో అధికార, ప్రతిపక్షా ల మధ్య అయితే కాళేశ్వరం.. లేక పోతే బనకచర్ల అన్నట్టుగా రాజకీయ పోరు నడుస్తోంది. రేవంత్ సర్కార్ కాళేశ్వరం కమిషన్ వేయడం.. ఆ కమిషన్ ముందుకు గులాబీ బాస్ కేసీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్ హాజరైన సంగతి తెలిసిందే. కాళేశ్వరం, దానిమీద వేసిన కమిషన్ విచారణ లొల్లి నడుస్తుండగానే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కొత్తగా బనకచర్ల ప్రాజె క్టు తెరమీదకు వచ్చింది.
ఏపీ బనకచర్లను కట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే రేవంత్ సర్కా ర్ నిద్రపోతోందని హరీశ్రావు మండిపడుతూనే ఉన్నారు. బనకచర్లకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు తమ ప్రయత్నాలను గట్టిగా చేయాలని, తామూ కలిసి వస్తామని హితువు పలుకుతున్నారు.. కాంగ్రెస్ కాళేశ్వరం, బీఆర్ఎస్ బనకచర్ల అంటూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
తమ్మనబోయిన వాసు