27-06-2025 11:39:43 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): మాదకద్రవ్యాల (మత్తు)కు బానిస అయితే వారి జీవితం ఎలాగా దుర్బల పరిస్థితి ఈ చేరుకుంటుందో కవిత్వం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న కార్తీక్ రాసిన కవిత్వం అందరిని ఆలోచింపజేస్తుంది. ఆయన రాసిన కవిత్వం మార్పుకు నాంది పలకాలని ఆశిద్దాం...
👈 మత్తు కొరకు గమ్మత్తుగా..
డ్రగ్స్ వాడితే జీవితం అయితది చిత్తుచిత్తుగా....
👈 మాదకద్రవ్యాలు వాడితే పోతాయి ప్రాణాలు..
అవి జీవితాన్ని చిత్తుబొత్తు చేసే సిలుంబట్టిన నాణాలు
👈 మత్తు తీస్తుంది ప్రాణం..
ఓ యువత ఎంచుకో నీ జీవిత గమనం..
👈ఓ రైతన్న గంజాయి పండిస్తూ సమాజాన్ని చేయకు నిర్లక్ష్యం...
ఓ యువత దేశ భవిష్యత్తు నీ చేతిలో ఉంది సాధించు నీ లక్ష్యం...
👈వృధా చేయకు ద్రవ్యం..
ఇకనైనా వీడనాడు మాదకద్రవ్యం..
లేదంటే నీ తనువులో తరిగిపోతది రక్తద్రవ్యం..
👈ప్రాణం పోసిన తల్లిదండ్రులను మరవకు..
ప్రాణం తీసే గంజాయిని మరువు...