28-06-2025 12:00:00 AM
- ఈ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇండ్లు
- పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణారావు
పెద్దపల్లి జూన్ 27 (విజయక్రాంతి); గత ప్రభుత్వంలో పేదలకు ఇల్లు ఇవ్వలేదని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామణరావు అన్నా రు. శుక్రవారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని జాఫర్ ఖాన్ పేట, ఎదులాపూర్, పెద్ద రాతుపల్లి, వెన్నంపల్లి గ్రామాల్లో పెద్దపల్లి ఎ మ్మెల్యే చింతకుంట విజయరమణా రావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు, ఇందిరమ్మ ఇళ్లకు ము గ్గులు పోసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు.
ముందుగా జా ఫర్ ఖాన్ పేటలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనం, పెద్దరాతుపల్లి లో నూతనంగా నిర్మించిన పల్లె ధవాఖాన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవే రాలని ఉద్దేశంతో సిఎం రేవంత్ రెడ్డి రూ.శ5 లక్షల తో ఇందిరమ్మ ఇండ్ల ను మంజూరు చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేస్తామ న్నారు.
గత ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా ఇం డ్లు మంజూరు చేయలేదని కాంగ్రెస్ ప్రభు త్వం రాగానే అర్హులైన లబ్ధిదారులకు ఇంద్ర మ్మ ఇల్లు మంజూరు చేసిందన్నారు. కూనా రం వ్యవసాయ పరిశోధన కేంద్రం రావడానికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మాజీ ఎమ్మెల్యే గిట్ల ముకుంద రెడ్డి అన్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్ర అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తామన్నారు. కూనరం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అగ్రికల్చర్ బీఎస్సీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
పెద్ద పల్లి లో బస్సు డిపో పూర్తయితే ప్రతి గ్రామానికి బస్సు వస్తుందన్నారు. చివరి ఆయకట్టు ప్రాంతాలకు సాగునీరు అందించమని ఎ మ్మెల్యే అన్నారు.పది ఏండ్ల బిఆర్ఎస్ పాలనలో ఒక్క కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వలేదుకాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని కేజీ ఎన్ ఫంక్షన్ హాల్లో కొత్త రేషన్ కారడ్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు హమాలీ కార్మికులకు ఇన్సూరెన్స్ పత్రాలను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూపది సంవత్స రాలు బిఆర్ ఎస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన రేషన్ కార్డులను మన ప్రజా ప్రభుత్వం అధికారంలోని వచ్చాక కొత్త రేషన్ కార్డులు మం జూరు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన అనే కార్యక్రమంతో పేద ప్రజలకు న్యాయం జరుగుతుం దన్నారు. కొత్త రేషన్ కార్డులకు త్వరలోనే స న్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు.
కాంగ్రె స్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మన నియోజకవర్గంలో ఎలాంటి తరుగు లేకుం డా ధాన్యం కొనుగోలు చేసి రైతన్నల మొ హంలో చిరునవ్వు చూశామని, మన నియోజకవర్గంలో వడ్ల బోనస్ ఘనియంగా జమ చేయడం మనకు గర్వకారణం అన్నారు.
కాం గ్రెస్ ప్రభుత్వానికి అన్ని వేళల ప్రజల మ ద్దతు ఉండాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు మార్కెట్, సింగిల్ విండో చైర్మన్ లు, మాజీ ప్రజాప్రతినిధులు,సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలు గ్రామాల ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.