31-05-2025 11:00:17 AM
తాడుతో కట్టివేసి, దేహ శుద్ధి చేసిన స్థానికులు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఇద్దరు వివాహితులే, కానీ వారిని కలిపింది ఫేస్బుక్(Facebook) ఆ పరిచయం ప్రేమగా మారి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో అడ్డంగా బుక్కై పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు ప్రియుడు ప్రియురాలు. పెద్దపల్లి జిల్లా(Peddapalli district) సుల్తానాబాద్ లోని అశోక్ నగర్ కు చెందిన ఓ వివాహిత ఇద్దరు పిల్లల తల్లి. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామి అనే యువకుడు అశోక్ నగర్ చెందిన వివాహితతో గత కొంతకాలంగా ఫేస్బుక్ పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. మరి కాస్త అది అక్రమ సంబంధం గా మారిపోయింది. వీరిద్దరూ ఇంట్లో కలిసి ఉండగా అశోక్ నగర్ లో వీరిని పట్టుకొని బోరింగుకు తాడుతో కట్టివేసి, దేహ శుద్ధి చేశారు ఆ కాలనీవాసులు. అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ చేశారు.