31-05-2025 08:23:58 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో.. ధాన్యం కటింగ్ తో ..రైతుల గోస.
మిల్లర్ల ఇష్టారాజ్యంతో, నిర్వాహకుల నిర్లక్ష్యంతో రైతులు... కుదేలు.
జిల్లా కలెక్టర్ విచారణ జరిపి న్యాయం చేయాలని రైతుల డిమాండ్.
తుంగతుర్తి, విజయక్రాంతి: రైతులు ఆరు కాలం కష్టపడి ,పండించిన పంటను,ధాన్యం కొనుగోలు సెంటర్లకు తీసుకొని వెళ్లి.. కష్టపడే ,మిషన్లతో శుభ్రపరచి..20 రోజులు పైబడి ఎండబెట్టి.. సరైన పద్ధతిలో తేమ శాతం చూపించి కాంటాలు పెట్టి.. ధాన్యం లోడ్ చేసి.. మిల్లులకు పంపిస్తే.. మిల్లర్ల యాజమాన్యం, ఐకెపి నిర్వాహకుల యాజమాన్యం నిర్లక్ష్యం, ఇష్టారాజ్యంతో రైతులకు కటింగ్ పేరుతో.. ఒక్క లారీకి ..33 బస్తాలు కటింగ్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం(Thungathurthy Mandal) గానుగుబండ ఐకెపి సెంటర్లో చోటు చేసుకుంది.
బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం... తూర్పు గూడెం గ్రామానికి గుండ గాని గోపాల్, వెంపటి గ్రామానికి చెందిన గౌడ్ చర్ల శ్రీకాంత్ అనే రైతులు 20 రోజుల తరబడి ఐకెపి సెంటర్లో ధాన్యం ఎండబోసి ,బస్తాల్లో కాంటావేశారు. అనుకోని ప్రకృతి వైపరీత్యా, రాత్రివేళ, అకాల వర్షంతో కొన్ని బస్తాలు తడి సాయి. రైతులు కష్టపడి తడవకుండా రాత్రికి రాత్రే ప్రైవేటు తర్బన్లు తెచ్చి బస్తాల పై కప్పిపెట్టారు. ఐకెపి నిర్వాహకుల నియమ నిబంధనల ప్రకారం, రైతులకు ఒడ్లు తడవకుండా ఉండడానికి, వారే రైతులకు ఉచితంగా, తర్భన్లు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నప్పటికీ అధికారులు సిబ్బంది, నిర్లక్ష్యం చేయడంతో సెంటర్లకు పూర్తిస్థాయిలో తార్బన్లు రాలేకపోయాయి.
దీనితో రైతులకు మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు చందంగా వారి పరిస్థితులు మారాయి. అయినప్పటికీ ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనాలి అని తెలియజేసినప్పటికీ, దీనితో యాజమాన్యం ఇరువురు రైతుల ధాన్యం సుమారు 654బస్తాలను ఒకే లారీ లోడు వేసి, కోదాడ నాగార్జున రైస్ మిల్లుకు పంపారు. వారు ధాన్యం తడిసిపోయిందని చెబుతూ, లారీని పెండింగ్ పెట్టి సుమారు 33 బస్తాల కటింగ్ తో 12 క్వింటాల కటింగ్ తో బిల్లు చేయించుకుని సంబంధిత సెంటర్ యజమాని వచ్చారు. దీనితో ఇరువురు రైతులకు సుమారు 25వేల రూపాయలు నష్టం వాటిల్లుతున్నది. దీనితో రైతుల బోధిపోమంటూ.. ఐకెపి ఎపిఎం కు రైతులకు తెలియజేశారు. ఐకెపి నిర్వాహకుల నిర్లక్ష్యం, మూలంగా కాంటా పెట్టిన ధాన్యం బస్తాలు తడవడంతోనే తాము నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కోదాడ రైస్ మిల్ యాజమాన్యంతో మాట్లాడి, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.