11-06-2025 07:54:23 PM
ఇల్లెందు (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం బస్ పాస్ చార్జిలను 20 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఇల్లందు మండల కమిటీ(CPM Yellandu Mandal Committee) ఆధ్వర్యంలో ఇల్లందు బస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ ధర్నా ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబి(CPM District Committee Member Abdul Nabi) మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపై చిన్న ఉద్యోగస్తులపై భారలు మోపడానికి చూస్తుందని ఈ చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థులకు పాఠశాల కళాశాల ఫీజులే భారంగా మారిన ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం బస్సు పాసుల చార్జీలను కూడా పెంచడం బాధాకరమని అన్నారు.
విద్యార్థులకు ఉచిత బస్సులు పెట్టి విద్యనందించాల్సిన ప్రభుత్వం ఈ విధమైన చర్యల వలన విద్యార్థుల చదువులకు ఇబ్బందిగా మారుతుందని తక్షణమే ఈ చార్జీలను తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు తాళ్లూరి కృష్ణ మన్నె మోహన్ రావు, తాళ్లూరి పద్మ, వజ్జా సురేష్, రమ పాల్గొన్నారు.