calender_icon.png 14 June, 2025 | 5:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన సబ్ మెర్సిబుల్ పంపు ప్రారంభం

11-06-2025 07:57:02 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో నూతనంగా ఏర్పాటు చేసిన 350 హెచ్పీ సబ్ మెర్సిబుల్ పంపును సింగరేణి ఏరియా జిఎం జి.దేవేందర్(Singareni Area GM G. Devender) ప్రారంభించారు. బుధవారం చతులాపూర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపును ప్రారంభించి మాట్లాడారు. కేకే–5 గని నుండి వచ్చే నీటి సరఫరా కొంతకాలంలో నిలుపుదల చేయబడుతుందని దీనిని దృష్టిలో పెట్టుకొని కేకే–1 గని నీటిని బోర్ వెల్ ద్వారా పైకి తీసుకువచ్చి శుభ్రం చేసి అనంతరం కార్మిక కాలనీలకు నీటి సరఫరా మెరుగు పరిచేందుకు నూతన పంపు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ ఎజిఎం ఈ అండ్ ఎం వెంకటరమణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సివిల్ ఎస్ఈ రాము, సివిల్ ఎస్ఈ జయప్రకాష్, కేకే ఓసి ఇంజనీర్ నాగ సంతోష్, సివిల్ సూపర్వైజర్ రాకేష్, అధికారులు, ఫోర్ మెన్లు పాల్గొన్నారు.