11-06-2025 07:49:03 PM
తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు..
హుజురాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కళాకారుల పాత్ర కీలకమని ఉద్యమ కళాకారులను ఆదుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు(Telangana Jana Samiti State General Secretary Mukkera Raju), గాయకుడు నేర్నాల కిషోర్ లు అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో బుధవారం పాటల పల్లకి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి కళాకారులను ఆదుకొని ఉద్యోగాలు కల్పించాలని వారు కోరారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక కళాకారులకు అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఉద్యమం కరీంనగర్ కేంద్రంగానే బలపడిందని అన్నారు. ఈనెల 15న ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కరీంనగర్ కళాభారతి లో జరిగే పాటల పల్లకి 12 గంటల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉద్యమకారులు, మేధావులు, కళాకారులు హాజరై విజయవంతం చేయాలని వారి కోరారు. ఈ కార్యక్రమంలో కళాకారులు చక్రాల రఘు, యాకన్న, జంగా అనిల్, సంద మల్ల నరేష్, పిట్ట రమేష్,విష్ణు, ఆరూరి రాజు, నగేష్,జంపన్న, రవి తో పాటు తదితరులు పాల్గొన్నారు.