15 June, 2026 | 7:03 PM

Breaking News

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •   ప్రభుత్వ బడులను మూసివేసే కుట్ర, ముఖ్యమంత్రి మానుకోవాలి.   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు   •   ఉపముఖ్యమంత్రిని కలిసిన అరెపల్లి   •  

గ్యాస్ కొరతపై సీపీఎం వినూత్న నిరసన

19-03-2026 01:14 AM

ఘట్ కేసర్, మార్చి 18 (విజయక్రాంతి) : వంట గ్యాస్ కొడతను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని సిపిఎం మండల కార్యదర్శి ఎన్. సబిత ఆరోపించారు. బుధవారం పోచారం డివిజన్ పరిధిలోని అన్నోజిగూడ రాజీవ్ గృహకల్ప లో సిపిఎం కార్యకర్తలు వంటగ్యాస్ పక్కనపెట్టి కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సబిత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన దేశ విదేశాంగ విధానాన్ని తాకట్టుపెట్టి అమెరికా, ఇజ్రాయిల్ లకు లొంగుబాటు వైఖరి వల్ల వంటగ్యాస్ సంక్షోభం ఏర్పడిందన్నారు.

ఫలితంగా హోటల్లు, టీ దుకాణాలు ఇతర చిరు వ్యాపారులకు గ్యాస్ కొరత ఏర్పడి ఫలితంగా వాటి ధరలు దారుణంగా పెరిగాయన్నారు.  తక్షణమే బ్లాక్ మార్కెట్‌ను నియంత్రించి న్యాయంగా అవసరమైన ప్రతి ఒక్కరికి వంటగ్యాస్ సరఫరా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె. అలివేల, అరుణ, సునీతదేవి, నాగమణి, శ్రావణి, పర్వీన్, ప్రమీల, శోభ, స్వరూప, సాలమ్మ, కలమ్మ, పద్మ, నవనీత,  రేణుక, ఫర్జాన పాల్గొన్నారు.