అన్ని దానాలకన్న అన్నదానం మిన్న
మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ
మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్
సుల్తానాబాద్,(విజయశాంతి): అన్ని దానాల కంటే అన్నదానం ఎంతో గొప్పదని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ అన్నారు. సుల్తానాబాద్ పట్టణానికి చెందిన పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు కొమురవెల్లి భాస్కర్ పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం స్థానిక మానసిక వికలాంగుల కేంద్రంలోని వికలాంగులకు అన్నదానం, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికిముఖ్యఅతిథిలుగా హాజరైన బిరుదు రాధాకృష్ణ, అయిల రమేష్ లు మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాల సందర్భంగా హంగులు, ఆర్భాటాలకు పోకుండా పేదలకు, మానసిక వికలాంగులకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఇలాంటి సేవాభావాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వారు కోరారు.






