15 June, 2026 | 7:21 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

కీతవారిగూడెంలో ఉపాధి హామీ పథకానికి తూట్లు

15-06-2026 06:35 PM

* అర్హులకు పని దినాలు కరువు...

* అనర్హులకు వరాలు...?

మాకు న్యాయం చేయాలి అంటూ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు కూలీల నిరసన

గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకం అమలుపై సోమవారం కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కల్పించిన 120 రోజుల పనిదినాల హామీ అమలు కావడం లేదని, అర్హులైన కూలీలకు తగిన పనిదినాలు కేటాయించడం లేదని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కొందరికి ఎక్కువ రోజులు, మరికొందరికి తక్కువ రోజులు మరికొందరికి పని దినాలు పెట్టటం లేదంటూ తనకు ఇష్టానుసారంగా పని పెట్టిన వారికి మళ్లీ పేర్లను నమోదు చేస్తున్నారని ఉపాధి హామీ కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల కేటాయింపులో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద కూలీలకు న్యాయం చేసి పారదర్శకంగా పనిదినాలు కేటాయించాలని వారు కోరారు.