calender_icon.png 23 June, 2025 | 2:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫీస్ లేదు.. అడ్రస్ లేదు!

23-06-2025 01:16:12 AM

  1. రోడ్డుపై బ్యానర్ ఏర్పాటు

అక్కడే దరఖాస్తుల స్వీకరణ 

నిరుద్యోగుల జీవితాలతో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ చెలగాటం

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (విజయ క్రాంతి) నిరుద్యోగుల జీవితాలతో ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు చెలగాటం ఆడుతున్నాయా అంటే కచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. అనునిత్యం ఔట్సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా దగా పడుతున్న నిరుద్యోగుల కథనా లు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆఫీస్ లేదు... అడ్రస్ లేదు... సాయిరాం ఏజెన్సీస్ అనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీ రోడ్డుపై బ్యానర్ ఏర్పాటు చేసి ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్న వైనం భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గత రెం డు రోజులుగా చోటుచేసుకుంది.

ఔట్సోర్సిం గ్ ఏజెన్సీస్ అగ్రిమెంట్లో, పేపర్ ప్రకటన లో ఇచ్చిన అడ్రస్, దరఖాస్తులు స్వీకరిస్తున్న అడ్రస్ కు ఎలాంటి పొంతన లేకుండా ఉంది. అంతేకాదు స్వీకరించిన దరఖాస్తులకు ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదు. దరఖాస్తులు సమర్పించేందుకు వచ్చిన అభ్యర్థులు అడ్రస్ కోసం నానా తండాలు పడుతున్నారు. ఉద్యోగాలను దొడ్డి ధారణ అమ్ముకొని, తుతు మంత్రంగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారని ఆరోపణలు వెలబడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో ప్రభుత్వ మైనారిటీ పాఠశాలలు కాలేజీల్లో బిజెపి ఇంగ్లీష్, పీజీటీ తెలుగు, పేజేటి ఉర్దూ, డిప్యూటీ వార్డెన్, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ఔట్సోర్సింగ్ ద్వా రా నియామకం చేయడానికి సాయిరాం ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. సాయి రాం ఏజెన్సీ పేపర్ నోటిఫికేషన్ ద్వారా ఈనెల 20, 21 తేదీలలో దరఖాస్తులు స్వీకరించబడతాయని పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది.

దరఖాస్తులను పాల్వంచ లోని 15-1-38, శాస్త్రి రోడ్డు లోని తమ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. వాస్తవంగా ఆ అడ్రస్ లో సాయిరాం ఏజెన్సీస్ ఆఫీసు లేదు. బొల్లోరుగూడెం లోని జడ్పీఎస్‌ఎస్ పాఠశాల పక్కన రోడ్డుపై గల బడ్డీ కొట్టుకు బ్యానర్ కట్టి దరఖాస్తుల సేకరించడం గమనార్హం. అంతేకా దు వివరాల కోసం ఇచ్చిన సెల్ ఫోన్ నెంబ ర్ కూడా ఏజెన్సీస్ కి సంబంధించినది కాదు. 9849375836 ఈ నెంబర్ నల్గొండకు చెందిన ఓ రాజకీయ నాయకుడి సెల్ ఫోన్.

దీన్ని బట్టి సాయిరాం ఏజెన్సీ నిరుద్యోగుల తో ఎలా చెలగాటం ఆడుతుందో తేట తెల్లమవుతుంది. శనివారం మధ్యాహ్నం కొత్తగూడెం, చండ్రుగొండ, ఇల్లందు, బూర్గంపాడు, టేకులపల్లి, మండలాల నుంచి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించేందుకు పాల్వంచకు వచ్చారు. ఏజెన్సీస్ ఆఫీస్ అడ్రస్ కోసం రెండు, మూడు గంటలు పా ల్వంచ మొత్తం తిరిగి చివరకు బడ్డీ కొట్టు అడ్రస్సును కనుక్కున్నారు.

అప్పటికే సదరు ఏజెన్సీస్ వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో బిక్కముఖం వేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఔట్సోర్సింగ్ బోర్డు పెట్టుకొని దగా చేస్తున్న సాయిరాం ఏజెన్సీని తక్షణమే రద్దుచేసి నేరు గా జిల్లా మైనారిటీ అధికారి ద్వారానే దరఖాస్తులు స్వీకరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి తప్పనిసరిగా పర్మినెంట్ కార్యాలయం, సిబ్బంది కంప్యూటర్లు కలిగి ఉండాలి.

అభ్యర్థుల నుంచి స్వీకరించిన దరఖాస్తులకు తప్పనిసరిగా రాసేది ఇవ్వాలని టెండర్ నిబంధనలో పొంద పరుస్తారు. సదరు సాయిరాం ఏజె న్సీ నిబంధనలు తుంగలో తొక్కి నిరుద్యోగులను దగా చేస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కలెక్టర్ తక్షణమే సాయిరాం ఏజెన్సీస్ పై చర్యలు తీసుకోవాలని నిరుద్యోగులు, సోషల్ ఆర్గనైజర్ మహమ్మద్ అన్వర్ డిమాండ్ చేశారు.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం 

పేపర్ ప్రకటన చూసి ఎంతో ఆశతో దరఖాస్తు చేయడానికి కొత్తగూడెం ఇల్లెందు చండ్రుగొండ బూర్గంపాడు టేకులపల్లి మండలాల నుంచి వచ్చామని, అడ్రస్ కోసం సుమారు రెండు గంటల పాటు పాల్వంచ మొత్తం తిరగాల్సి వచ్చిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తేరా వచ్చేసరికి డబ్బా కోర్టు అడ్రస్ దొరికిందని దరఖాస్తులు ఇస్తామంటే ఎవరూ లేరని దరఖాస్తు చేయడానికి వచ్చిన కే యాదిశ, సున్నం మాధవి, నేహా, భవాని తమ గోడు వెళ్ళగక్కారు. 

సాయిరాం ఏజెన్సీ ని రద్దు చేయాలి 

మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఆధ్వర్యంలో అవుట్సోర్సింగ్  ఉద్యోగాలకు వెలువడిన ప్రకటన ఆధారంగా దరఖాస్తు చేయడానికి వచ్చాను అభ్యర్థులకు ఔట్సోర్సింగ్ కార్యాలయం లేదని, రోడ్డుపై బ్యానర్ కట్టి దరఖాస్తుల స్వీకరించడం ఏమిటని, తక్షణమే నోటిఫికేషన్ రద్దుచేసి సాయిరాం ఏజెన్సీని తొలగించాలని, నేరుగా జిల్లా మైనారిటీ అధికారి ద్వారానే దరఖాస్తులు స్వీకరణ చేపట్టాలని కొత్తగూడెంకు చెందిన సోషల్ ఆర్గనైజర్ మహమ్మద్ అన్వర్ డిమాండ్ చేస్తున్నారు. 

మహమ్మద్ అన్వర్ (సోషల్ ఆర్గనైజర్) విచారణ చేసి చర్యలు తీసుకుంటాం 

సాయిరాం ఏజెన్సీ ప్రకటనలో, కా ర్యాలయంలో సమర్పించిన అగ్రిమెం ట్లో నమోదు చేసిన అడ్రస్‌లో కాకుం డా రోడ్డుపై బ్యానర్ కట్టి దరఖాస్తులు స్వీకరిస్తున్న అంశాన్ని డిఎండబ్ల్యూఓ సంజీవ రావు దృష్టికి తీసుకెళ్లగా, అలా దరఖాస్తుల స్వీకరించడం నిబంధనలకు విరుద్ధమని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. 

డి ఎండబ్ల్యూ ఓ సంజీవరావు