చర్ల, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): మెషీన్ గన్ మిస్ఫైర్ అయి ఓ అసిస్టెంట్ కమాండెం ట్ మృతిచెందిన ఘటన బుధవారం ఉద యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని పూసుకుప్ప సీఆర్పీఎఫ్ క్యాంపులో జరిగింది. ఎస్పీ రోహిత్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బేస్ క్యాంప్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం.వి.శేషగిరి (47) 81 సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు, బీడీ బృందాలతో కలిసి ఏరియా డామినేషన్కు వెళ్లి వాహనం లో తిరిగి వస్తున్నారు. వాహనం ఓ చప్టా దాటుతుండగా శేషగిరి జారీ కిందపడ్డారు. ఘటనలో అప్పటికే లోడ్చేసి ఉన్న మెషీన్ గన్ మిస్ ఫైర్ అయి శేషగిరి ఛాతిలోకి బుల్లె ట్లు దూసుకెళ్లాయి. జవాన్లు క్షతగాత్రుడిని వెంటనే భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. బెటాలియన్ అధికారు ల ఫిర్యాదు మేరకు చర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.