3 April, 2026 | 7:05 AM

అక్రమ నిర్మాణాలు కూల్చివేత

20-02-2025 12:11 AM

అబ్దుల్లాపూర్‌మెట్, ఫిబ్రవరి 19: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ తట్టి అన్నారం గ్రామ సర్వే నంబర్ 127/1 ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దీని  విజయక్రాంతి పత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. మంగళవారం ‘ప్రభుత్వ భూమిని కాపాడండి’ శీర్షికన ప్ర  కథనానికి రెవెన్యూ అధికారులు స్పందించారు.

బుధవారం ఉ  తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆర్‌ఐ ఇం నాఱుణి తన సిబ్బందితో వెళ్లి తట్టిఅన్నారంలో ప్రభుత్వ భూమి  అక్రమ నిర్మాణాలను కూల్చివేయించారు. ఈ సందర్భంగా తహ  సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభు  భూమిలో నిర్మాణాలు చేపట్టినా, ప్రభు  భూమిని ఆక్రమించాలని చూసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.