14-10-2024 12:02:44 AM
దర్శకుడు సముద్ర వారసులు అరుణ్ మహాశివ, రామ్ త్రివిక్రమ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘దో కమీనే’. హారిక సమర్పణలో చందు క్రియేషన్స్ బ్యానర్పై ప్రొడ్యూసర్ చంద్ర పులుగుజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సముద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో తస్మయి, శ్రీ రాధ కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో నటులు శ్రీకాంత్, సుమన్, దర్శకుడు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ అతిథులుగా పాల్గొన్నారు.