15 April, 2026 | 1:51 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

బుల్డోజర్లతో అభివృద్ధి సాధ్యం కాదు

06-04-2025 12:10 AM

బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి):  ప్రత్యేక పాలసీలతో నగరా న్ని అభివృద్ది పథంలోకి తీసుకెళ్లాలని, బుల్‌డోజర్లతో అభివృద్ధి సా ధ్యం కాదని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హితవు పలి కారు. హైదరాబాద్‌లో ఆఫీసుల వసతుల లీజింగ్ పడిపోతుండడంపై కేటీ ఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది మొదటి త్రైమాసిక కాలంలో ఆఫీసుల వసతుల లీజింగ్ 41 శాతానికి పడిపో వడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కొత్త ఐటి పార్కులపై దృష్టిపెడుతున్న సీఎం ఇలాంటి ప్రమాదకర పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూ చించారు. చెన్నై, డిల్లీ, ముంబై, పుణే నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఆఫీస్‌ల వసతుల లీజింగ్ గణనీయంగా దిగజారిందని పేర్కొన్నారు.