21 April, 2026 | 6:34 PM

Breaking News

సబ్ స్టేషన్ నిర్మాణపు స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ శాఖ జిల్లా అధికారి.   •   డ్యూటి కానిస్టేబుల్ పై దాడి   •   ప్రతి విద్యార్థి పది మందికి సహాయం చేసే స్థాయికి ఎదగాలి   •   ఆందోళన చెందకండి.. ఆదుకుంటాం   •   ఇటుక బట్టిలో ట్రాక్టర్ బోల్తా.. కార్మికుడు మృతి   •   జిల్లా వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుడు నూతి జన్మదిన వేడుకలు   •   రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ   •   నా భూమికి రక్షణ కల్పించండి   •   గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం : ప్రిన్సిపాల్ డాక్టర్ స్నేహలత   •   బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •  

ధ‌నుష్ ‘కుబేర’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘పోయి రా మావా’

20-04-2025 12:43 PM

ప్రముఖ చిత్రనిర్మాత శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తమిళ సినీ నటుడు ధనుష్(Dhanush) నటిస్తున్న 'కుబేర' చిత్రం నుండి మొదటి పాట అధికారికంగా ఆదివారం విడుదలైంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై సునీల్ నారంగ్ నిర్మించిన 'కుబేర' చిత్రంలో ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున అక్కినేని(Nagarjuna Akkineni) కూడా కీలక పాత్రలో నటించారు.

ధనుష్ సరసన రష్మిక మందన్న(Rashmika Mandanna) కథానాయికగా నటించారు. ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది. 'పోయి రా.. పోయి రా మావ' అనే మొదటి పాటను ఇప్పుడు మేకర్స్ విడుదల చేశారు. ఈ మెలోడియస్ ట్రాక్‌లో భాస్కర్ భట్ల రాసిన సాహిత్యం ఉంది. ధనుష్ స్వయంగా పాడారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, శేఖర్ మాస్టర్ విజువల్స్(Shekhar Master Visuals) కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన సినిమాలు సాధారణంగా ప్రేక్షకులను ఆకర్షించేలా ఉంటాయి. అందులోనూ ధనుశ్‌తో శేఖర్ కమ్ముల చిత్రం అంటే భారీ అంచనాలను సృష్టించింది. ఇటీవల విడుదలైన మొదటి పాట ఇప్పటికే ప్రేక్షకులను మెప్పిస్తోంది.

https://youtu.be/TIAI36faO84