17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

టీపీసీసీ ధర్నా

20-12-2025 01:51 PM

పీసీసీ ఆందోళన

హైదరాబాద్: ప్యారడైజ్ ఎంజీరోడ్(Paradise MG Road)లో ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ(Mahatma Gandhi) పేరును తొలగింపుకు నిరసనగా టీపీసీసీ చీఫ్(TPCC chief) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసనలో మహేశ్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, వీహెచ్ పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసనలు చేశారు.

కేంద్రం నిర్ణయంపై(Central Government) దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, బాపు అంటే ప్రతి యువకుడు ఆలోచన చేస్తాడని మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. బాపు విషయంలో కేంద్రం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని మంత్రి వాకిటి డిమాండ్ చేశారు. చట్టాన్ని వెనక్కి తీసుకోకుంటే పోరాటం చేస్తామని, ఉపాధి హామీ పథకం పేరు మార్పు దారుణమని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని తొలగించాలని బీజేపీ చూస్తోందని మండిపడ్డారు. ప్రపంచలోని అన్ని దేశాల్లో గాంధీ విగ్రహాలున్నాయని, గాంధీ పేరు తొలగించడం దుర్మార్గమని మంత్రి అజారుద్దీన్ స్పష్టం చేశారు.