02-06-2025 12:47:33 AM
భద్రాచలం, జూన్ 1 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలోని స్వామివారి శేష వస్త్రాల విక్రయశాలలో క్రైస్తవ మత ప్ర చారంతో కూడిన కవర్లలో విక్రయాలు జరుగుతున్న వైనం. గుంటూరు జిల్లాకు చెందిన భక్తులు స్వామివారి శేష వస్త్రాలు కొనుగోలు చేసిన సందర్భంగా ఈ విషయం వెలుగు చూసింది.
దీంతో భక్తుడు చేస్తున్న అధికారులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైన అన్యమత ప్రచార విషయం. ఆదివారం ఉదయం దైవదర్శనం అనంతరం శేష వస్త్రాల విక్రయశాలలో పట్టు వస్త్రాలు కొనుగోలు చేసిన భక్తుడికి JESUS CHRIST IS LORD OF ALL అని ముద్రించి ఉన్న కోవర్లో వస్త్రాలను అందచేసిన విక్రయధారుడు.
దీంతో అన్యమత ప్రచారాన్ని గుర్తించిన భక్తుడు ఆలయ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గుంటూరుకు చెందిన జనార్దన్ అనే భక్తుడు... ఆలయంలో అన్యమత ప్రచారంపై ఫిర్యాదు అందుకున్న దేవస్థానం అధికారులు వెంటనే విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. ఆలయ ప్రాంగణంలో అధికారుల పర్యవేక్షణలేమికి ఇది చక్కటి నిదర్శనం.