38 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
అశ్వాపురం,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి – షాదీ ముబారక్ పథకం కింద అశ్వాపురం మండలానికి చెందిన 38 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.38,42,408 విలువైన చెక్కులను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.






