calender_icon.png 4 June, 2025 | 5:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు విత్తనాల పంపిణీ

03-06-2025 01:07:07 AM

చేవెళ్ల , జూన్ 2: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చేవెళ్ల మండలంలో ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన నాణ్యమైన మూల విత్తనాల (ఫౌండేషన్ సీడ్) ను స్థానిక ఎమ్మెల్యే యాదయ్య  పంపిణీ చేశారు.

వరి కేఎన్‌ఎం 1638 రకం మూల విత్తనాలను ఒక్కో గ్రామంలో ఎంపిక చేసిన ఇద్దరు -ముగ్గురు అభ్యుదయ రైతులకు వ్యవసాయ శాఖ సహకారంతో ఈ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ళ పిఏసిఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, ముడిమ్యాల పిఏసిఎస్ చైర్మన్ గోనె ప్రతాపరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, ఏఏంసి చైర్మన్ పెంటయ్య గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, నాయకులు మార్పల్లి కృష్ణారెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్గారి కార్తీక్ రెడ్డి, ఏంపిటీసి గుండాల రాములు, చేవెళ్ల మాజీ ఉపసర్పంచ్లు టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, గంగి యాదయ్య, అధికారులు చేవెళ్ళ సహాయ వ్యవసాయ సంచాలకులు సురేష్ బాబు,  ప్రొఫెసర్ శ్రీనివాసరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏవో, మండల వ్యవసాయ అధికారి శంకర్ లాల్ ఏఈవోలు పాల్గొన్నారు.