03-06-2025 01:07:04 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, జూన్ 2 (విజయక్రాంతి): అన్ని దానాల కంటే విద్య దానం గొప్పదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ పద్మనాయక మినీ కళ్యాణ మంటపం లో వెలమ సంక్షేమ మండలి జగిత్యాల వారి ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేసారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూఅన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పదని అన్నారు.ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేయడం అభినందనీయమని, దీనివల్ల విద్యార్థులు మరింత చదువుకోవడానికి ఉత్సాహం పొందుతారన్నారు.సమాజంలో అన్ని వర్గాలతో కలిసి ఉండే వ్యక్తిత్వం వెలమ కులస్తులదన్నారు.
విద్య ద్వారానే అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందని, చదువులో రాణించి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి తన వంతుగా, సంఘం తరపున సహాకారం ఉంటుందన్నారు.విద్య తోనే నేటి సమాజంలో గౌరవం పొందుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆయిల్నేని సాగర్ రావు, ప్రధాన కార్యదర్శి వేణు గోపాల్ రావు, మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు, నాయకులు రామచందర్ రావు, సుధాకర్ రావు, నరేందర్ రావు, వేణుగోపాల్ రావు, తదితరులు పాల్గొన్నారు.