28-06-2025 10:57:27 PM
ఖమ్మం,(విజయక్రాంతి): రాష్ట్రానికి ఆదర్శంగా ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగం అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల పని తీరుపై అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ సాగు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు భరోసా, రైతు భీమా, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం వంటి పలు అంశాలపై జిల్లా కలెక్టర్ మండలాల వారీగా చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో ఆధునిక సాగు పద్ధతులు పాటించడం, పంటల మార్పిడి విధానం అమలు వంటి కార్యక్రమాల్లో మన జిల్లా, రాష్ట్రంలో ఆదర్శవంతంగా తయారు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, ఇంచార్జ్ జిల్లా ఉద్యానవన అధికారి ముత్యాలు, కూసుమంచి, వైరా, ఖమ్మం అర్బన్, సత్తుపల్లి, మధిర ఏడిఏలు, మండల వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారిణి అనిత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.