24 March, 2026 | 7:47 PM

Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనకు సత్వర చర్యలు   •   సంత నిర్వాహణ వేలంలో పెరిగిన ఆదాయం 5.02 శాతం మాత్రమే   •   జిల్లాను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం   •   ద్వారకుంటలో సిసి రోడ్డు శంకుస్థాపన: సర్పంచ్ పాలకి సురేష్   •   ఖైదీలకు బెయిల్ విషయంలో సహాయం చేయడమే సాధికార కమిటీ ఉద్దేశ్యం   •   కోనరావుపేట 10వ వార్డ్‌లో పారిశుధ్య సమస్యలు   •   కోదండరామాలయం పరిసరాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు   •   కల్లూరు నుండి హైదరాబాద్‌కు బస్సు సర్వీస్   •   కలెక్టరేట్ ముందు టీచర్ల భారీ నిరసన ప్రదర్శన   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన కట్టకొమ్ము తండా సర్పంచ్   •  

ఇల్లందు ఎస్ఐ సందీప్ ను సన్మానించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

19-03-2025 08:33 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలలో 502.5 మార్కులను సాధించిన ఎస్సై సందీప్ ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఇల్లందు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తూ గ్రూప్-1 పరీక్షలకు హాజరయ్యి మంచి మార్కులు సాధించినందుకు గాను సందీప్ ను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. సాధారణ వ్యవసాయ కుటుంబం నుండి వచ్చి ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా కష్టపడుతున్న ఎస్సై సందీప్ భవిష్యత్తులో కూడా మంచి విజయాలను సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి చంద్రభాను, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.