దివీస్ లాబ్స్ లాభం 67 శాతం అప్
26-05-2024 12:05 AM
రూ.321 కోట్ల నుంచి రూ.538 కోట్లకు
ముంబై, మే 25: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా కంపెనీ దివీస్ లాబొరెటరీస్ నికరలాభం 2024 మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 67.6 శాతం వృద్ధిచెంది రూ.538 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదేకాలంలో కంపెనీ రూ.321 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం సైతం 18 శాతం వృద్ధితో రూ. 1,951 కోట్ల నుంచి రూ. 2,303 కోట్లకు పెరిగింది. శనివారం సమావేశమైన దివీస్ లాబ్స్ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.30 చొప్పున డివిడెండు ప్రకటించింది.






