10 May, 2026 | 5:46 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

దీపావళికి పటాకులు కాల్చొద్దు

15-10-2024 02:07 AM

ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 14: దేశ రాజధానిలో పటాకులపై ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిషేధం విధించింది. నగరంలో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోవడమే దీనికి కారణమని అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో ఇప్పటి కే  ఎయిర్ ఇండెక్స్ క్వాలిటీ 221గా నమోదైంది.

ఈ నేపథ్యంలో రానున్న దీపావళికి పరిస్థితి మరింత చేయిదాటకూడదనే ముందు జాగ్రత్తలో భాగం గా 2025 జనవరి 1 వరకు పటాకుల కాల్చివేతపై ఢిల్లీ పీసీబీ నిషేధం విధించింది. అన్ని రకాల బాణాసంచా.. తయారీ, నిల్వ, అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ పోలీసులు కొత్త నిబంధనలను వెంట నే అమల్లోకి తెచ్చేలా కార్యచరణ సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసిం ది.