5 May, 2026 | 7:04 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

అసభ్యకర పోస్టులు పెడితే ఊరుకోం

07-10-2024 01:06 AM

 బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదులు

హైదరాబాద్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ పెడుతున్న ఫేక్ పోస్టులపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఫేక్ ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

మాజీ ఎమ్మెల్యే జీవ న్‌రెడ్డి నిజామాబాద్ కమిషనర్‌కు, గోషామహల్ నియోజకవర్గానికి చెందిన ఆశీష్‌కుమార్ యాదవ్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయగా, సిరిసిల్లలో పలువురు యువ నాయకులు పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో సీఐకి పలు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అసత్య ప్రచారాలు మానకుంటే తగిన గుణపాఠం చెబుతామన్నారు.