17-11-2025 12:09:58 AM
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
బచ్చన్నపేట నవంబర్ 16 విజయక్రాంతి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఆదివారం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్న రామంచర్ల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని కురుమ సంఘం జిల్లా రాష్ట్ర నేతలు ఎగ్గే మల్లేశం, క్యామ మల్లేశం లతో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం కేమిడి కనకరాజు అధ్యక్షతన వహించగా. జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో గుండెను ఎదురుగా పెట్టి పోరాడిన మహా యోధులు దొడ్డి కొమురయ్య అని అన్నారు. భూమికోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఆయన ఆశయ సాధనకు అంకితభావంతో ముందుండి పోరాటాలు చేయవలసిన బాధ్యత మనపై ఉందన్నారు.