16 August, 2026 | 1:21 PM

Districts - Mulugu

article_63363042.webp
ఆహార భద్రతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట

ములుగు, ఆగస్టు 15 (విజయక్రాంతి): పేదల ఆకలి తీర్చుటకు, ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆహార భద్రత కార్డులు మంజూరు చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్వహించిన పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, పేద కుటుంబాలు కూడా నాణ్యమైన సన్న బియ్యంతో రెండు పూటలా కడుపునిండా భోజనం చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

15-08-2026

article_68763946.webp
సీఎం పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలి

ములుగు,ఆగస్టు 12(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16న జిల్లా పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను నిర్దేశిత గడువులోగా వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు పరిసరాలను ఆకర్షణీయంగా సుందరీకరించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌తో కలిసి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిప్యాడ్‌ను, గట్టమ్మ వద్ద ఏర్పాటు చేసిన పైలాన్ నిర్మాణం పనులను పరిశీలించి, గట్టమ్మ దేవాలయాన్ని సందర్శించారు.

12-08-2026

article_63323455.webp
మల్లంపల్లిలో ఎంపీడీవో, ఎంఆర్ఓ కార్యాలయం మంజూరు పట్ల హర్షం

ములుగు, (విజయక్రాంతి): ములుగు జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ మల్లంపల్లి మండల అభివృద్ధి కోసం మంత్రి సీతక్క చేస్తున్న కృషి అద్భుతమని కాంగ్రెస్ నేత మూల గణేష్ రెడ్డి కొనియాడారు. మల్లంపల్లిని మండలం గా ప్రకటించడంలో మంత్రి సీతక్క కృషి అభినందనీయమని అయితే ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నడంతో దీనిపై దృష్టి సారించిన మంత్రి కార్యాలయాల ఏర్పాటుకు హామీ ఇవ్వడం మండల ప్రజల అదృష్టం అన్నారు. మల్లంపల్లి మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధిపై మంత్రి సీతక్క దృష్టి సారించిందని, గతంలో ఎన్నడు లేని విధంగా మండలం అభివృద్ధి పథంలో మరింత ముందుకు దూసుకుపోతుందని తెలిపారు. మంత్రి సీతక్క మల్లంపల్లి మండలంలో ఎంపీడీవో ఎంఆర్ఓ కార్యాలయం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేయడంతో పాటు మండల ప్రజల పక్షాన ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

12-08-2026