17 April, 2026 | 10:58 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

29 న డాక్టర్.దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు

26-03-2025 12:34 AM

వనపర్తి టౌన్, మార్చి 25 ( విజయక్రాంతి )  సాహితీ కళావేదిక మరియు తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యములో   మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 29 న దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ నందు మహాకవి డాక్టర్.దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహింపబడతాయని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ తెలిపారు.

దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకల సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని మంగళవారం మాజీమంత్రి నిరంజన్ రెడ్డి  ఆయన స్వగృహంలో విడుదల చేసారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దాశరథి కృష్ణమాచార్య రచనలు ఈ తరానికి రాబోవు తారలకు స్ఫూర్తిదాయకం కావాలని ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని సాహితీవేత్తలు, కవులు, కళాకారులు ,తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  నాయకులు తదితరులు పాల్గొన్నారు.