5 June, 2026 | 4:58 PM

నూతన బోరు బావి తవ్వకంతో తీరిన నీటి ఎద్దడి

05-06-2026 04:24 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని పిప్పల్ దరి గ్రామంలో మంచినీటి ఎద్దడి ప్రారంభం కావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. అయితే బోరు బావిని తవ్వించాలని గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి ప్రస్తుత సర్పంచ్ అనసూయలకు విన్నవించారు. దీంతో స్పందించి విషయాన్ని స్థానిక శాసనసభ్యులు జాదవ్ అని దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే బోరు బావి మంజూరి చేయించడంతో శుక్రవారం ఉదయం బోరుబావిని తవ్వించారు. గ్రామ సర్పంచ్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి బోరుబావిని తవ్వించడంతో నీరు పైకి రావడం జరిగింది. దీంతో గ్రామస్తులు పరిశ్రమ వ్యక్తం చేసి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ బండారు స్వామి గ్రామస్తులు ఉన్నారు.