25-06-2025 12:18:43 AM
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘డ్యూడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. కీర్తిశ్వరన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రదీప్కు జోడీగా ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. సీనియర్ నటుడు శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రదీప్ రంగనాథన్, మమిత బైజూకు ఫస్ట్లుక్ పోస్టర్లకు మంచి స్పందన దక్కింది.
ఈ సినిమాలో కథానాయిక మమిత బైజు పాత్ర పేరు ‘కురళ్’గా పరిచయం చేస్తూ మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మమిత.. తన బ్యూటీ అండ్ చార్మ్తో కట్టిపడేసింది. ‘ప్రేమలు’లో తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్తో క్రేజ్ హీరోయిన్గా మారిన మమిత తాజాచిత్రం ‘డ్యూడ్’తో మరోమారు అలరించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తిస్థాయిలో జరుగుతుండగా.. దీపావళి కానుగా విడుదల చేసే లక్ష్యంతో మూవీ టీమ్ జెట్ స్పీడ్లో పనిచేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: సాయి అభ్యంకర్; సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి; ఎడిటర్: బరత్ విక్రమన్.