16 March, 2026 | 9:09 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

సూరానా గ్రూప్‌పై ఈడీ దాడులు

17-04-2025 01:56 AM

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి):  నగరంలోని సురానా, సాయి సూర్య డెవలపర్స్‌లో బుధవారం ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్‌లో సురానా గ్రూప్ చైైర్మ న్, ఎండీ డైరెక్టర్ ఇళ్ల్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నైకి చెంది న ప్రముఖ బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు రూ. 3,986 కోట్లను ఎగ్గొట్టిన కేసులో ఆ గ్రూప్‌పై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది.

2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ.11. 62 కోట్ల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. కంపెనీకి చెందిన ఇద్దరు ప్రమోటర్లు, సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపైనా పీఎంఎల్‌ఏ కేసు నమోదైంది. తాజా దాడుల్లో సురానా, సాయి సూర్య మధ్యన ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతోంది.