20-06-2025 07:46:16 PM
మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బిటిఎస్ చౌరస్తా వద్ద దోమకొండ, బీబీపేట, దుబ్బాక, సిద్ధిపేట వెళ్లే నేషనల్ హైవేలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయుటకు కృషి చేయాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్(MP Suresh Kumar Shetkar)కి దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ శుక్రవారం వినతిపత్రం అందజేశారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో దిశ సమావేశానికి హాజరైన ఎంపీ సురేష్ షెట్కర్ను కలసి వినతి పత్రం అందజేశారు.
బిటిఎస్ నుండి దోమకొండ, బీబీపేట, దుబ్బాక మాచారెడ్డి బిక్కనూరు, సిద్దిపేట, నిజాంపేట భూంపల్లి, వేములవాడ గంభీరావుపేట సిరిసిల్ల నుంచి హైదరాబాద్, కామారెడ్డి వెళ్లే వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని, కామారెడ్డి వెళ్లాలంటే టోల్ గేట్ వద్దకు వెళ్లి తిరిగి ప్రయాణం చేయవలసి వస్తుందని వినతి పత్రంలో పేర్కొన్నారు. అందువలన విలువైన సమయాన్ని కోల్పోవడంతో పాటు ఆర్థికంగా కూడా నష్టపోతున్నారని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు.
ప్రస్తుతం ఉన్న బ్రిడ్జి చిన్నదిగా ఉండడంతో లారీలు బస్సులు ఇతర భారీ వాహనాలు వెళ్ళుటకు అనువుగా లేదని, అందువలన వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బ్రిడ్జి సమస్యను త్వరగా పరిష్కరించేందుకు తమరు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంపీకి జెడ్పిటిసి తీగల తిరుమల్ గౌడ్ కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, గ్రామ అధ్యక్షుడు సీతారాం మధు, జనరల్ సెక్రెటరీ తాటిపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.