14-06-2025 12:13:39 AM
ఎల్లారెడ్డి, జూన్ 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామానికి చెందిన బలగం అలి యాస్ బాల్ లింగం (67) కు శుక్రవారం తెల్లవారుజామున పాము కాటు వేసినట్లు మృతుని భార్య సిద్దవ్వ తెలిపారు. మృతుని భార్య సిద్ధవ్వ నాగిరెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాల్ లింగం గురువారం రాత్రి భోజనం చేసి నిద్ర ఉపక్రమించాక శుక్రవారం వేకువజామున సుమారు నాలుగు గంటల ప్రాంతంలో తన ఇంటిలో పాము కరిచినట్లు భార్యకు తెలపడంతో కుమారులతో కలిసి వైద్యం నిమిత్తం ఆటోలో మెదక్ తీసుకువెళ్లారు.
వైద్యుడు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు వాహనం లో పాము కరిచిన వ్యక్తిని తరలిస్తుండగా మెదక్ శివార్ ప్రాంతంలోని పసుపులేరు వంతెన పై ఉదయం 9 గంటల ప్రాంతంలో బాల్ లింగం మృతి చెందినట్లు భార్య సిద్దవ్వ తెలిపినట్లు ఎస్త్స్ర తెలిపారు. భర్త బాల్ లింగం మృతిపై ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.