14-06-2025 12:12:28 AM
నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్
కరీంనగర్, జూన్ 13 (విజయ క్రాంతి): నగర పారిశుధ్యంను మరింత మెరుపరిచి... రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ నూతన కమీషనర్ ప్రపుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం కమీషనర్ గా ప్రపుల్ దేశాయ్ బదిలి పై వెల్లిన చాహాత్ బాజ్ పాయ్ నుంచి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా కమీషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ వికాస, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు ఇతర పథకాలు నగర ప్రజలకు అందేలా పరిపాలన బాధ్యలు చేపడుతామని తెలిపారు. అంతే కాకుండా నగర అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి నగర అభివృద్దే ద్యేయంగా పని చేస్తామని తెలిపారు. స్మార్ట్ సిటి ప్రాజెక్టు అభివృద్ధి పనులతో పాటు ఇతర గ్రాంట్స్ అభివృద్ధి పనుల్లో ఎలాంటి గ్యాబ్స్ ఉన్న పూర్తి చేసి అందులో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
వివిధ కారణాలతో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు ప్రారంభించి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరపాలక సంస్థ లో రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, బర్థ్ & డెత్ సెక్షన్లలో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ ఆదాయ మార్గాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. విలీన గ్రామాల డివిజన్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ప్రస్తుతం నగరపాలక సంస్థ డీ లిమిటేషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేస్తామని తెలిపారు.
ప్రజల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి... మేజర్ సమస్యలు ఉన్న చోట్లను స్వయంగా విజిట్ చేసి డి లిమిటేషన్ చేస్తామన్నారు. ప్రధానంగా పారిశుధ్యంలో సమూల మార్పులు తెచ్చి... పరిశుభ్రమైన నగరాన్ని ప్రజలకు అందించేలా చర్యలు తీస్కుంటామని తెలిపారు. నగరంలో పచ్చదనాన్ని మరింత పెంచి గ్రీన్ సిటిగా మార్చేందుకు తగిన చర్యలు తీస్కుంటామనితెలిపారు.