30 June, 2026 | 11:10 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వర్షంలో గొడుగులు పట్టుకొని ఉద్యోగుల నిరసన

01-09-2024 01:28 PM

యాదాద్రిభువనగిరి, (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా TGEJAC ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 న పెన్షన్ విద్రోహదినం పురస్కరించుకుని  సిపిఎస్, యుపిఎస్ రద్దు చేసి ఒపిఎస్ ను పునరుద్దరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగులు,గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఇ జెఎసి) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా జెఎసి స్టీరింగ్ కమిటీ  నిర్ణయానుసారం యాదాద్రి భువనగిరి జిల్లా తహసీల్ ఆఫీస్ భువనగిరి వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం మందడి ఉపేందర్ రెడ్డి అధ్యక్షులు TGO యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పదవి విరమణ చేసిన OPS ఉద్యోగుల బాధలు వర్ణాతీతం అని అన్నారు. వెంటనే ops పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘo, యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి, కొల్పుల రమేష్, అస్సోసియేట్ అధ్యక్షులు విజయ్ మరియు సభ్యులు నాల్గవ తరగతి ఉద్యోగులు,  TNGO యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భరత్, కార్యదర్శి ఖదీర్, PRTU మండల అధ్యక్షులు మనోరంజన్ రెడ్డి, UTF మండల కార్యదర్శి వెంకటేష్, యాదాద్రి భువనగిరి జిల్లా పెన్షన్ సంఘము భాద్యులు మోహన్ రెడ్డి, ఆనందం, కిష్టయ్య, సోదర ఉద్యోగ సంఘ భాద్యులు పాల్గొన్నారు.