30 June, 2026 | 10:17 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రేపటి ప్రజావాణి (గ్రీవెన్స్) కార్యక్రమం రద్దు

01-09-2024 01:58 PM

కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్,(విజయక్రాంతి): సెప్టెంబర్ రెండవ తేదీ (సోమవారం) కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని భారీ వర్షాల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి నేడోక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో చెరువులు, కుంటలు, వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు, ఎలాంటి ఇబ్బందులు కలగద్దు అనే ఉద్దేశంతో పాటు జిల్లా యంత్రాంగం అంతా సహాయక చర్యలలో నిమగ్నం అయినందున  ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇట్టి  విషయాన్ని గమనించి ప్రజలు  ఫిర్యాదులు ఇచ్చుటకు కలెక్టరేట్    కార్యాలయానికి ఎవరూ రావద్దని, వచ్చే సోమవారం ప్రజావాణి యాదవిధిగా కొనసాగుతుందని కలెక్టర్ అట్టి ప్రకటన లో వెల్లడించారు