6 June, 2026 | 6:00 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం

06-06-2026 05:07 PM

చర్లలో పర్యావరణ వారోత్సవాల సందడి

ఒక్కొక్కరు మొక్క నాటాలని ఎంపీడీఓ  ఈదయ్య పిలుపు.

చర్ల,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఈదయ్య ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. పర్యావరణ వారోత్సవాలలో భాగంగా మండలంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని ఎంపీడీఓ  ఈదయ్య కోరారు. "పచ్చదనం పెంచడం ద్వారానే భావితరాలకు మంచి భవిష్యత్తును అందించగలం.

మొక్కలు నాటడం మనందరి బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. మండలంలో పచ్చదనం పెంపు, భూగర్భ జలాల సంరక్షణ ప్రతి ఇంటికీ ఒక మొక్క-ప్రతి వ్యక్తికి ఒక బాధ్యతని  "మొక్కలు నాటుదాం, భూమిని, పర్యావరణాన్ని, కాపాడుదాం"అని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు. విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయనున్నారని అన్నారు. జూన్ 5 నుంచి ప్రారంభమైన ఈ పర్యావరణ వారోత్సవాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయని తెలిపారు.