30 July, 2026 | 8:07 PM

Breaking News

భారీ వర్షాలు, అప్రమత్తమే ప్రాణరక్షణ!   •   'స్నేహితుల దినోత్సవం' గీతాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి   •   ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు   •   ప్రజాస్వామ్యం బలోపేతానికి ఓటర్ నిర్ణయమే కీలకం: డిసిసి అధ్యక్షులు   •   వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   బాల కార్మికులను పనిలో పెట్టుకున్న అరుణ్ మహేష్ పై సస్పెక్ట్ షీట్ ఓపెన్   •   బదిలీపై వెళ్తున్న డిఎంకు ఘన సన్మానం   •   పీర్జాదిగూడలో ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు   •   బొల్లారంలో పేకాట స్థావరంపై పోలీసుల ఆకస్మిక దాడి   •   93/2 సర్వే నెంబర్లు పాసుపుస్తకాలు ఇవ్వాలి   •  

మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం

06-06-2026 05:07 PM

చర్లలో పర్యావరణ వారోత్సవాల సందడి

ఒక్కొక్కరు మొక్క నాటాలని ఎంపీడీఓ  ఈదయ్య పిలుపు.

చర్ల,(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని చర్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) ఈదయ్య ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. పర్యావరణ వారోత్సవాలలో భాగంగా మండలంలోని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణకు తమవంతు కృషి చేయాలని ఎంపీడీఓ  ఈదయ్య కోరారు. "పచ్చదనం పెంచడం ద్వారానే భావితరాలకు మంచి భవిష్యత్తును అందించగలం.

మొక్కలు నాటడం మనందరి బాధ్యత" అని ఆయన పేర్కొన్నారు. మండలంలో పచ్చదనం పెంపు, భూగర్భ జలాల సంరక్షణ ప్రతి ఇంటికీ ఒక మొక్క-ప్రతి వ్యక్తికి ఒక బాధ్యతని  "మొక్కలు నాటుదాం, భూమిని, పర్యావరణాన్ని, కాపాడుదాం"అని పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు. విద్యార్థులతో పాటు స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేయనున్నారని అన్నారు. జూన్ 5 నుంచి ప్రారంభమైన ఈ పర్యావరణ వారోత్సవాలు వారం రోజుల పాటు కొనసాగనున్నాయని తెలిపారు.