23 March, 2026 | 5:32 PM

Breaking News

మాగంటి గోపీనాథ్‌ కుటుంబంలో మరో విషాదం   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్   •   పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి   •   రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్.. అంకెల గారడి బడ్జెట్   •   ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించండి   •   కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు తక్షణమే పరిష్కరించాలి   •   ఆనందోత్సాహాలతో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం   •   అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి ఆర్థిక సహాయం   •   విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు రూ. కోటి ప్రమాదబీమా చెక్కులు పంపిణీ   •  

59 రోజులు సమ్మె చేసినా బీఆర్‌ఎస్ పట్టించుకోలే

25-07-2024 12:28 AM

సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని 

బీఆర్‌ఎస్ ఆర్టీసీ విషయంలో ఇప్పుడు ఆందోళన చేస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులు 59 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సమ్మె కాలంలో  ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. హుజూర్‌నగర్‌లో ఘటన వల్ల బీఆర్‌ఎస్‌కు తమ మద్దతు ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కోసం తమ పార్టీ కూడా ఆరు రోజులు సమ్మె చేసినట్లు చెప్పారు. కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియలో చేర్చాలని, వారికి రావాల్సిన డీఏ కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.