15 June, 2026 | 10:02 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?

13-04-2026 11:18 AM

విరుదునగర్: తమిళనాడులోని విరుదునగర్ జిల్లా(Virudhunagar District) సత్తూరు సమీపంలో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో సోమవారం భారీ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. అగ్నిమాపక, రెస్క్యూ శాఖ అధికారుల ప్రకారం, సత్తూరు సమీపంలోని మడత్తుపట్టిలో ఉన్న Excel బాణసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. 

పేలుడు సంభవించిన తర్వాత ఆ ప్రాంగణం లోపల పలువురు కార్మికులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.  అగ్నిమాపక, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాణసంచా కేంద్రంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. బాణసంచా కేంద్రం వద్ద మంటల ధాటికి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. బాణసంచా కేంద్రం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్మేసింది. పేలుడు శబ్ధం వినగానే స్థానికులు, కార్మికులు ప్రాణభయంతో పరుగులు పెట్టారని పోలీసులు తెలిపారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తోంది.