25-06-2025 01:41:29 AM
మంచిర్యాల, జూన్ 24 (విజయక్రాంతి) : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకంలో భాగంగా మంగళ వారం నాటికి 1,48,739 మంది రైతుల ఖా తాలలో రూ. 189 కోట్ల 37 లక్షల 10 వేల 233 జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి కల్పన తెలిపారు. జిల్లాలోని 18 మం డలాల్లోనీ 419 గ్రామాలలో 1,71,307 మం ది రైతులకు రూ. 205 కోట్లు రైతు భరోసా అందించవలసి ఉండగా 1,52,621 మంది రైతులకు రూ. 198 కోట్ల 96 లక్షల 63 వేల 519 రూపాయలు ప్రభుత్వ ఖజానాకు పం పించడం జరిగిందన్నారు.