25-06-2025 01:43:58 AM
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయంచిన ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్, జూన్ 24 (విజయక్రాంతి): దేశ భవిష్యత్తు యువతపై ఉందని ఆ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి జీవనాన్ని పొందాలని ఎస్పీ జానకి షర్మిల పిలుపునిచ్చారు.మంగళవారం బాసర త్రిపు ల్ ఐటీలో మాదకద్రవ్యాల నియంత్రణ వారోత్సవాలను పురస్కరించుకొని అవగాహన సదస్సులు నిర్వహించారు. విద్యార్థుల కు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రదర్శన నిర్వహించి శబ్దాన్ని చేయించారు.
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను విద్యార్థుల భవిష్యత్తుకు నాశనం చేస్తాయని దీనివల్ల తల్లిదండ్రులు కూడా మంచి పేరు పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ వాటికి రవాణా చేయడానికి సహకరించిన చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు.
గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎక్కడ కనిపించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎస్పీ కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ గోవర్ధన్, ఏఎస్పీ అవినాష్ కుమార్, సీఐ మల్లేష్ ఎస్ఐ సమ్మయ్య పోలీస్ సిబ్బంది ఉన్నారు
డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి యుద్ధం: ఎస్పీ అఖిల్ మహాజన్
అదిలాబాద్, జూన్ 24 (విజయకాంతి): మాదక దవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా పోలీ సు యంత్రాంగంతో ప్రజలు, విద్యార్థులు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉం దని స్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లాలో వారం రోజుల పాటు యాంటీ డ్రగ్ వీక్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ యాంటి డ్రగ్ వీక్లో పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్కు వ్యతిరేకంగా వ్యాసరచన పోటీలు, చితలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ యాంటీ డ్రగ్ వీక్ లో భాగంగా మంగళవారం స్థానిక ఓ ప్రైవే ట్ పాఠశాలలో డ్రగ్స్కు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన కార్యకమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని డ్రగ్స్ ద్వారా కలిగే అనర్థాలను వివరించి విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ వ్యతిరేక పోస్టర్ల ను ఆవిష్కరించారు. కార్యకమంలో డిఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సునీల్కుమార్, కరుణాకర్ రావు, ప్రణయ్కుమార్ పాల్గొన్నారు.