25-06-2025 01:24:16 AM
రంగారెడ్డి, జూన్ 24( విజయ క్రాంతి ) నిరుపేదలకు ఉచిత విద్యపై ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవలనే రాష్ట్ర హైకోర్టు విద్యా హ క్కుచట్టం ప్రకారం తప్పనిసరిగా ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలో 25శాతం సీట్లు కేటాయించాల్సిందేనని అందుకు అధికారులు చ ర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. దీనికి స్పందించిన విద్యాశాఖ అధికారులు సైతం కోర్టుకు లిఖితపూర్వకంగా లేఖను అందజేసింది.
ఈ విద్యా సంవత్సరం నుంచి చట్టం అమలు పై చర్యలు తీసుకుంటామని కోర్ట్కు నివేదించారు.ఆ దిశగా ప్రస్తుతం రా ష్ట్ర విద్యాశాఖ అధికారులు కసరత్తులు ప్రా రంభించారు.చట్టం పకడ్బందీగా అమలు అయితే జిల్లాలో నిరుపేద విద్యార్థులకు న్యా యమైన విద్య ఉచితంగా అందనుంది.విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలో 25% ఉచితంగా నిరుపేద వి ద్యార్థులకు సీట్లు అమలు చేయాల్సి ఉంది....
2009లో విద్యా హక్కు చట్టం అమలైనప్పటికీ ఆ చట్టం కేవలం కాగితాలకే పరిమితం అయింది. ఆ దిశగా పాలకులు అడు గులు వెయ్యకపోవడం... చట్టం అమలుపై చిత్తశుద్ధి లేకపోవడంతో పదిహేనేళ్లుగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో నిరుపేదలకు ఉచితంగా సీట్లు అందని ద్రాక్షగానే మి గిలింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో నిరుపేదల కుటుంబాల్లో ఆశలు చిగురుస్తున్నాయి.
2009 విద్య హక్కు చట్టం ప్రకారం ఉచిత నిర్బంధ విద్యలో భాగంగా నిరుపేదలకు 25% సీట్లు తప్పనిసరిగా కేటాయించా ల్సిందేనని ఇదివరకే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సైతం జారీ చేసింది. గత కొంతకాలంగా ఉచి త విద్య పై ఎన్నో ఆశలు పెట్టుకున్న నిరుపేద తల్లిదండ్రులకు కోర్టు నిర్ణయంతో పెద్ద ఊరటనిచ్చినట్లు అయింది. ఉచిత విద్య కోర్టు ఆదేశాలను విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు స్వాగతిస్తున్నారు.
ముక్కు పిండి ఫీజులు వసూలు.....
రేక్కాడితే కానీ డొక్కాడాని బడుగు జీవులు తమ బిడ్డలను ఉన్నత చదువుల కో సం అహర్నిశలు శ్రమిస్తున్నారు. అనునిత్యం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి నాలుగు రాళ్లు వెనకేస్తూ తమ బిడ్డలను ఏ లోటూ రా కుండా చదివిస్తున్నారు. ప్రపంచంతో పోటీపడేలా తమ బిడ్డలు ఎదగాలని వారి భవిష్య త్తుపై గంపెడాశలు పెట్టుకొని అప్పులకు సై తం వెనకాడకుండా విద్య కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు.
పల్లెల్లో నాణ్యమైన విద్య అందడం లేదని... వారి భవిష్యత్తుపై బెంగ పడుతూ ఇంగ్లీషు చదువుల కోసం పట్టణాలకు వలస వస్తున్నారు. దీనినే అవకాశం గా భావిస్తున్న ఆ కార్పోరేట్,ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులను చల్లని కబుర్లు చెబుతూ... మాటల గారడితో తల్లిదండ్రుల నుంచి అందిన కాడికల్లా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. టెక్నో, ఇంటర్నేషనల్ ఇలా రకరకాల తోక పేర్లు చెబుతూ వారి నుంచి జలగల్లా ఫీజు లు దండుకుంటున్నారు.
ఇప్పుడు ప్రస్తుతం కొత్త రకంగా దో పిడీ మొదలుపెట్టారు అదే పాఠశాలలో చదువు పూర్తి అయిన విద్యార్థుల నుంచి అ ప్ గ్రేడ్ పేరిట అక్రమంగా ఫీజులు లాగేసుకుంటున్నారు. ఆయా పాఠశాలలో పెంచిన ఫీజులు చెల్లించలేక తమ బిడ్డలను పాఠశాల నుంచి మార్చలేక ప్రై వేట్,కార్పోరేట్లో ఫీజుల దోపిడిని పై పోరాటం చేయలేక విద్యార్థుల తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.
చట్టం అమల్లోకి వస్తే......
విద్య హక్కు చట్టం అమల్లోకి వస్తే ప్రభుత్వ జీవో 44 ప్రకారం మొత్తం 25 శాతం లో అనాథలు, ఎయిడ్స్ బాధిత చిన్నారులు,దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10%,ఎస్టిలకు 4 శాతం బీసీ మైనార్టీ ఇతర వర్గాల పిల్లలకు 6 శాతం సీట్లను కేటాయిస్తారు.
రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1581 పాఠశాలలు ఉండగా అందులో 1,000కి పైగా ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలు ఉన్నా యి.ఆయా పాఠశాలలో ప్రైమరీ మొదలుకొని హైస్కూల్ వరకు సరాసరిగా 500 నుంచి 1000 కి పైగా విద్యార్థులు ప్రస్తుతం విద్యను అభ్యసిస్తున్నారు. అందులో 25 శా తం సీట్లు ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తే 50వేలకు పైగా నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.