calender_icon.png 25 June, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు భరోసా నిధుల విడుదలతో రైతుల్లో ఉత్సాహం

24-06-2025 10:21:50 PM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల చిత్రపటాలకు పాలాభిషేకం 

సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని (విజయక్రాంతి): రైతు భరోసా నిధుల విడుదల రైతుల్లో ఎనలేని ఆనందం నింపిందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్(Single Window Chairman Kotha Srinivas) అన్నారు. మంగళవారం సాయంత్రం రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా మంథని మండలం సూరయ్య పల్లి రైతు వేదిక వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటి పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు తన సందేశం ఇచ్చారు.

అనంతరం కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లోనే 9,000 కోట్లను బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం విశేషమని అన్నారు. రైతు భరోసాతో రైతుల్లో భరోసా నిండిందని అన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమలు చేస్తున్న రైతు భరోసా పథకం నిధుల విడుదల ఈరోజుతో పూర్తయిందని తెలిపారు. ఈ సందర్భంగా  రైతులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సురేష్, ఏడిఏ అంజని, ఏవో నవ్య, టీజీఇఆర్సి మెంబర్ శశిభూషణ్ కాచే, ఏఎంసి మాజీ చైర్మన్ అజీమ్ ఖాన్, పిఎసిఎస్ డైరెక్టర్ కొత్త శ్రీనివాస్, నాయకులు మూల పురుషోత్తం రెడ్డి,గుండా పాపారావు,  గుండా రాజు , భీముని వెంకటస్వామి, కృష్ణ వంశీ, క్రాంతి,  రవి, ఏఈవోలు,పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.