24-06-2025 10:19:27 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): రైతు భరోసా వేడుకలు మానుకోట జిల్లాలో సంబరంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో రైతు వేదికల ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖాముఖీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. మహబూబాబాద్ పట్టణంలోని ఏటిగడ్డ రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) ఇతర అధికారులతో కలిసి పాల్గొన్నారు. సీఎం ప్రసంగాన్ని ఆధ్యాంతం రైతులు ఆసక్తిగా వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ... వానాకాలం 2025 కి సంబంధించి జిల్లాలో 2,05,789 మంది రైతులకు రైతు భరోసా రూపాయలు 243, 45,70,876 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు శ్రీనివాస రావు, మురళీ, హార్టికల్చర్ అధికారి జి.మరియన్న పాల్గొన్నారు.