calender_icon.png 15 June, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం

14-06-2025 06:04:39 PM

మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలను, నెరవేర్చే దాకా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రపోనివమని మాజీ మంత్రి వనమా(Former Minister Vanama Venkateswara Rao), బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావులు(BRS Party District President Sri Rega Kantha Rao) అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  పార్టీ జిల్లా కార్యాలయం లో పార్టీ మండల, పట్టణ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తమని, సీతారామ ప్రాజెక్టు నీళ్ల విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పూర్తి అన్యాయం జరిగిందన్నారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని, పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కేసిఆర్, కేటీఆర్ లపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ కేసులు పెట్టి వారిని బదనాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ కి మళ్లీ రెండవసారి ఏసీబీ రెండవసారి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా  కెసిఆర్,కేటీఆర్ లను ఎమీ చేయలేరన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ తమ పార్టీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.